జైపూర్ : రాజస్థాన్లోని మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతున్నది. ఈ మూడింటిని బీజేపీ గతంలో నిలుపుకోగా.. ప్రస్తుత ఉప ఎన్నికల్లో వాటిలో రెండింటిని కోల్పేయేటట్లుగా కనిపిస్తున్నది. గతంలో బీజేపీ జెండా ఎగిరిన సహాదా, సుజన్ఘడ్ స్థానాలను కాంగ్రెస్ తన వైపునకు తిప్పుకుంటున్నది. కాగా, రాజసమంద్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
ఉప ఎన్నికలు జరిగిన సహాదా స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గాయత్రీ దేవి త్రివేది ముందంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి 10 వ రౌండ్ తర్వాత 13781 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సుజన్ఘడ్లో కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ మేఘవాల్ ఆధిక్యంలో ఉండగా, రెండో స్థానంలో ఆర్ఎల్పీ అభ్యర్థి కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఖేమారాం మేఘవాల్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక్కడ 6వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి 4,222 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఇక రాజసమంద్ స్థానంలో బీజేపీ అభ్యర్థి దీప్తీ మహేశ్వరి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి తన్సుఖ్ బోహ్రాపై 14 వ రౌండ్ ముగిసిన తర్వాత 2185 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉప ఎన్నికల ఫలితాల్లో రెండు స్థానాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్రంలో మా పార్టీ పనితీరుకు నిదర్శనమని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ఎవరు గెలిచినా ఈ మూడు స్థానాల్లో విజయోత్సవాలు నిర్వహించవద్దని, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకట్టవేయాలని ఆయన కార్యకర్తలకు విజ్ఞప్తిచేశారు.
యూపీలో వారాంతపు లాక్డౌన్ సమయం పొడగింపు
అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ఎన్డీఏ
ఆధిక్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి
బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా!
పుదుచ్చరిలో ముందంజలో ఎన్డీఏ కూటమి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..