రాజశేఖర్ హీరోగా రామ్ గోపాల్ వర్మ ( RGV ) దర్శకత్వంలో వచ్చిన సినిమా దెయ్యం. ఈ చిత్రాన్ని ఇప్పుడు కాదు ఏడేళ్ల కిందే తెరకెక్కించాడు వర్మ. అప్పట్లో దానికి పట్ట పగలు అనే టైటిల్ కూడా పెట్టాడు. అయితే అప్పుడు ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. అలాగే ఉండిపోయింది. దాన్నే పేరు మార్చి దెయ్యం పేరుతో తాజాగా విడుదల చేశారు. అది కూడా కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉన్న సమయంలో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో కలిపి 5 భాషల్లో ఒకేరోజు విడుదల చేశారు. కానీ ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. తాజాగా ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..
ఆంధ్రా- 4 లక్షలు
నైజాం- 5 లక్షలు
సీడెడ్- 2 లక్షలు
ఈ సినిమాను అన్ని భాషల్లోనూ నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినా కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.50 లక్షలు రావాలి. కానీ అందులో వచ్చింది మాత్రం రూ.13 లక్షలు మాత్రమే. మళ్లీ అందులోనూ డెఫిసిట్లు పోనూ రూ.8 లక్షల షేర్ వచ్చింది. అంటే వర్మ ఖాతాలో మరో డిజాస్టర్ చేరినట్టే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ట్రక్కు డ్రైవర్ గా రకుల్ప్రీత్సింగ్
వకీల్ సాబ్ 13 డేస్ కలెక్షన్స్ ఎంతంటే..
పవన్ కళ్యాణ్తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
అల్లు అర్జున్ పాటను వాడేసిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్
కలర్స్ స్వాతి రీ ఎంట్రీ.. కొత్త కాన్సెప్ట్తో అలరించేందుకు రెడీ..!
జాతి రత్నాలు సీక్వెల్కు సన్నాహాలు.. స్టోరీ లైన్ ఇదే!