న్యూఢిల్లీ : కరోనాకు వ్యతిరేకంగా టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని సాధించింది. శనివారం నాటికి టీకా డ్రైవ్ 148వ రోజుకు చేరగా.. 25,28,78,702కు పైగా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. మరో వైపు 20,46,01,176 మొదటి టీకా డోసులు వేసి చారిత్రాత్మక మైలురాయిని అధిగమించినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. శనివారం ఒకే రోజు మొత్తం 31,67,961 మోతాదులు వేసినట్లు చెప్పింది. ఇందులో తొలి డోసు 28,11,307 మంది లబ్ధిదారులకు వేయగా, మరో 3,56,654 మంది లబ్ధిదారులకు రెండో మోతాదు అందజేసినట్లు చెప్పింది. 18-44 ఏజ్ గ్రూప్లో 18,45,201 మంది లబ్ధిదారులు మొదటి మోతాదును వేయగా.. 1,12,633 మంది లబ్ధిదారులకు సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసింది.