చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఆచార్య’. రామ్చరణ్ సమర్పణలో నిరంజన్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్చరణ్ సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే కథానాయికలు. కరోనా సెకండ్వేవ్ కారణంగా వాయిదా వేసిన చిత్రీకరణను ఇటీవలే పునఃప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్లో రామ్చరణ్పై కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం రామ్చరణ్ కొత్త స్టిల్ను విడుదల చేశారు. మెడలో రుద్రాక్ష మాల, కండువా ధరించి తీక్షణ చూపులతో రాజసంగా కనిపిస్తున్నారు రామ్చరణ్. దేవుడి మాన్యాల అన్యాక్రాంతం కథావస్తువుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇందులో చిరంజీవి ఆచార్యుడిగా, నక్సలైట్గా భిన్న పార్శాల్లో సాగే పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. గతంలో విడుదల చేసిన పోస్టర్స్లో చిరంజీవి, రామ్చరణ్ తుపాకులు చేతబూని సమరానికి సై అన్నట్లుగా కనిపించారు. ఆచార్య లక్ష్యసాధనకు తోడ్పాటునందించే ధీరోదాత్తుడిగా సిద్ధ పాత్ర శక్తివంతంగా సాగుతుందని అంటున్నారు. ‘తాజా షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవుతుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణావుక్కరసు, సంగీతం: మణిశర్మ, నిర్మాత: నిరంజన్రెడ్డి, రచన-దర్శకత్వం: కొరటాల శివ.