హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. మంగళవారం 70,280 టెస్టులు నిర్వహించగా, 431 మందికి పాజిటివ్గా తేలినట్టు బుధవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 111, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 37, రంగారెడ్డిలో 31, మంచిర్యాల, జగిత్యాలలో 21 చొప్పున కేసులు వెలుగుచూశాయి. ఏపీలో మంగళవారం 35,066 పరీక్షలు నిర్వహించగా, 585 మందికి పాజిటివ్గా తేలినట్టు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.