సిటీబ్యూరో, మార్చి 22(నమస్తే తెలంగాణ)/శంషాబాద్ : ఈ దొంగ జీవన శైలి భళే విచిత్రం.. కేవలం బ్రాండెడ్ దుస్తులను ధరించేందుకు, బీచ్ల్లో తిరిగేందుకు మాత్రమే చోరీలు చేస్తాడు. అది కూడా ఒంటిరిగానే చేస్తుంటాడు. చోరీలో కేవ లం బంగారాన్ని మాత్రమే టచ్ చేస్తాడు. మిగ తా వాటి జోలికి వెళ్లడు. ఇలా చోరీ చేసిన సొత్తు ను కూడా తాను నేరుగా విక్రయించకుండా స్నే హితులతో అమ్మిస్తాడు. నగదు రాగానే నేరుగా ముంబై, గోవా ప్రదేశాలకు వెళ్లి బీచ్ల్లో ఎంజాయ్ చేస్తాడు. బ్రాండెడ్ దుస్తులను కొనుగోలు చేసి రిచ్ లుక్ను తలచుకుని ఆనందపడుతుంటాడు. చోరీ నగదుతో యూఎస్ పోలో, పీటర్ ఇంగ్లాడ్, ఇలా అనేక పేరొందిన బ్రాండ్ల జీన్స్లు, టీషర్టులను కొనుగోలు చేస్తుంటాడు. ఈ విధంగా చోరీలకు పాల్పడుతున్న రాజేంద్రనగర్ చింతల్మెట్ సులేమాన్ నగర్కు చెందిన మహ్మద్ గౌసు అలియాస్ ఖూనీ గౌస్ ఎట్టకేల కు పోలీసులకు చిక్కాడు.. ఇతడు గతంలో దాదా పు 14 చోరీ కేసుల్లో అనుమానితుడిగా ఉండి.. తాజాగా మరో 6 ఇండ్లలో దొంగతనం చేసినట్లు తేలింది. నిజాం మ్యూజియం నుంచి బంగారు టిఫిన్ బాక్సు, టీ కప్పు-సాసర్, బంగారం పూతతో ఉన్న ఖురాన్ను ప్రధాన నిందితుడు ముబీన్తో కలిసి ఖూనీ గౌస్ చోరీకి పాల్పడ్డాడు. అప్పుడు అరస్టైన ఖూనీ గౌస్.. తిరిగి తాజాగా సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. సోమవారం అతడిని అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు.
రోడ్డుపై హంగామాచేసి దొరికిపోయాడు..
ఇటీవల సులేమాన్ నగర్ ప్రాంతంలో ఖూనీ గౌస్ మద్యం మత్తులో మరో వ్యక్తితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో నానా గందరగోళం సృష్టించాడు. చేతిలో కత్తి పట్టుకుని నానా హంగామా చేశాడు. ఈ ఘటనపై బాధితుడు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్లో ఈ నెల 5న ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలించినా అతడు దొరకలేదు. దీంతో ఆ బాధ్యతను శంషాబాద్ ఎస్ఓటీ టీంకు అప్పగించారు. వారు తీవ్రంగా గాలించి ఎట్టకేలకు నిందితుడు ఖూనీ గౌస్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాజాగా ఆరు ఇండ్లలో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంతో ఆరు చోరీ కేసుల మిస్టరీ వీడిపోయింది