చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణి
రాయపోల్/జగదేవ్పూర్/బెజ్జంకి/నంగునూరు/అక్కన్నపేట/హుస్నాబాద్టౌన్/హుస్నాబాద్రూరల్/నారాయణరావుపేట/సిద్దిపేట అర్బన్/సిద్దిపేట కమాన్/సిద్దిపేట జోన్/మార్కుక్ /మద్దూరు/కొమురవెల్లి/చేర్యాల, మే 8 : తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన ఇంటింటా ఆరోగ్య సర్వేను విజయవంతం చేయాలని చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణి కోరారు. చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఇంటింటా సర్వే నిర్వహణ తదితర అంశాల పై వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో సర్వేను పూర్తి చేయాలని, సర్వేకు ప్రజలు సహకరించాలన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, కౌన్సిలర్లు మంగోలు చంటి, పచ్చిమడ్ల సతీశ్, ఆడెపు నరేందర్, డాక్టర్ దీపాంజలి, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఇంటింటా సర్వే
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా సర్వే 2వ రోజు శనివారం మండల వ్యాప్తంగా కొనసాగింది. మండల కేంద్రం లో జరుగుతున్న సర్వేను కొమురవెల్లి ఇన్చార్జి తహసీల్దార్ నీలిమ పరిశీలించారు. మండలంలోని గురువన్నపేటలో జరుగుతున్న ఇంటింటా సర్వేలో ఎంపీవో వీరరాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో కొమురవెల్లి సర్పంచ్ సార్ల లత, ఆర్ఐ రమే శ్, ఏఎస్ఎంలు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకే..
ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టినట్లు ఎంపీడీవో శ్రీనివాస్గౌడ్ అన్నారు. మండలంలోని ధర్మారం, సలాఖపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న ఇంటింటి సర్వేను ఎంపీడీవో పరిశీలించారు. మద్దూరు ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ రాజు, సర్పంచ్లు వంగ భాస్కర్రెడ్డి, ఊట్ల రవీందర్రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
ఇంటింటా జ్వర సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆర్డీవో విజయేందర్రెడ్డి ఆదేశించారు.శనివారం మార్కుక్ మండలం లోని గంగాపూర్,ఎర్రవల్లి,గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను తహసీల్దార్ అరీఫా తో కలిసి ఆయన పరిశీలించారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి కిట్లను అందజేయాలన్నారు.
నిర్లక్ష్యం వద్దు..
కరోనా అంటే నిర్లక్ష్యం వద్దు.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.. దగ్గు, జ్వరం వస్తే ఆర్పీలకు కానీ, అంగన్వాడీ టీచర్ల దృష్టికి తీసుకెళ్లాలని మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు అన్నారు. మంత్రి ఆదేశాలమేరకు సిద్దిపేట 24వ వార్డులో శనివారం ప్రజలకు అవగాహన కల్పించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ నర్సయ్య ఉన్నారు. సిద్దిపేట పట్టణంలోని 25వ వార్డులో ఇంటింటా జ్వరం సర్వే నిర్వహించారు. కౌన్సిలర్ గుండ్ల యోగీశ్వర్ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె బాలకి షన్గౌడ్ తదితరులు ఉన్నారు.
ప్రజలు సహకరించాలి
కరోనా కట్టడికి వార్డు ప్రజలంతా సహకరించాలని సిద్దిపేట 32వ వార్డు కౌన్సిలర్ బందారం శ్రీలత రాజు అన్నారు. శనివారం వార్డులో ఏఎన్ఎం, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లతో కలిసి ఇంటింటా జ్వరం సర్వే నిర్వహించారు. ఏఎన్ ఎం రేణుకాదేవి, ఆశ వర్కర్ అరుణ, అంగన్వాడీ టీచర్లు స్వరూపారాణి, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే
సిద్దిపేట అర్బన్ మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం ఇంటింటా జ్వర సర్వే జరిగింది. ఆ సిద్దిపేట రూరల్ మం డలంలోని రావురూకుల గ్రామంలో సర్పంచ్ నీరటి కవిత రవీందర్ ఆధ్వర్యంలో జ్వర సర్వే నిర్వహించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారికి మందుల కిట్లను అందించామని సర్పంచ్ తెలిపారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తున్నదని ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ అన్నారు. నారాయణపేట మండల పరిధిలోని మాటిండ్ల, జక్కాపూర్, గుర్రాలగొందితో పాటు పలు గ్రామాల్లో ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, స్పెషల్ ఆఫీసర్ లత ఆధ్వర్యంలో జర్వ సర్వే నిర్వహించారు. నంగునూరు మండలంలోని నర్మెటలో వైద్యాధికారి రాధిక ఆధ్వర్యంలో ఇంటింటా జ్వరం సర్వే నిర్వహించారు. జేపీ తండాలో సివిల్ సైప్లె అధికారులు హరీశ్, ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, వైద్య సిబ్బంది ఇంటింటా జ్వరం సర్వే నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అక్కన్నపేట మండలంలోని మల్లంపల్లిలో ప్రారంభమైన ఇంటింటా జ్వర సర్వేను ఎంపీపీ మాలోతు లక్ష్మిబీలునాయక్ పరిశీలించారు. ఎంపీడీవో సత్యపాల్రెడ్డి, గ్రామ సర్పంచ్ మార్క తిరుపతి, మాజీ జడ్పీటీసీ మాలోతు బీలునాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాక నారాయణ, ఎంపీటీసీ వేముల శ్రీనివాస్, గిర్థావర్ సురేందర్ తదితరులు ఉన్నారు. హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్, తోటపల్లి, పందిల్ల తో పాటు పలు గ్రామాల్లో వైద్యాధికారులు ఇంటింటా సర్వే నిర్వహించారు. కరోనాను కట్టడిచేసేందుకు ఇంటింటా జ్వరాలపై సర్వే చేస్తున్నామని మున్సిపల్ వైస్చైర్పర్సన్ అయిలేని అనిత, మున్సిపల్ కమిషనర్ సుంకె రాజమల్లయ్య చెప్పారు. హుస్నాబాద్ పట్టణంలోని 4,5,11,19, 20వ వార్డుల్లో ఇంటింటా జ్వరాలపై సర్వే నిర్వహించారు. కౌన్సిలర్లు పెరుక భాగ్యారెడ్డి, దొడ్డి శ్రీనివాస్, బొజ్జ హరీశ్, వాల సుప్రజ, ఆర్పీలు, ఎఎన్ఎంలు ఉన్నారు. బెజ్జంకి మండలం లో రెండో రోజు ఇంటింటా సర్వే కొనసాగింది. సర్వేను తహసీల్దార్ విజయ ప్రకాశ్రావు, ఎంపీడీవో రఘువేంద్రరెడ్డి, సర్పంచులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీపీ పాండుగౌడ్ అన్నారు. మర్కూక్ మండలంలోని పాముల పర్తి గ్రామంలో ఇంటింటి జ్వర సర్వేను నాయకులు, అధికారులు, పరిశీలించారు. జడ్పీటీసీ మంగమ్మరాం చంద్రం, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి, ఎంపీడీవో ఓబులేశ్ తదితరులు పాల్గొన్నారు. జగదేవ్పూర్ మండలంలోని 29 గ్రామాల్లో రెండు రోజులుగా విస్తృతంగా చేపడుతున్న సర్వేలో భాగంగా 11033 ఇండ్లకు గాను 6051 ఇండ్లలో సర్వే జరిగిందని, అవసరమైన వారికి మెడికల్ కిట్లు అందిస్తున్నామని ఎంపీపీ బాలేశంగౌడ్ తెలిపారు.