జైపూర్: కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకోలేదు. చాలా రాష్ట్రాల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం లేని మారుమూల ప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్లోని బార్మెర్కు చెందిన ఉపాధ్యాయులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఒంటెలపై ప్రయాణించి మొబైల్ నెట్వర్క్లేని ఎడారి ప్రాంతాల్లోని విద్యార్థుల ఇండ్లకు వెళ్లారు. విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చి వారి ఇంటి వద్దనే పాఠాలు చెప్పారు. ఈ ఉపాధ్యాయుల చొరవను విద్యార్థుల తల్లిదండ్రులు కొనియాడారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.