న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: కరోనా సంక్షోభం కారణంగా పరిమితంగా రైలు సర్వీసులను నడుపుతున్న భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. రైలు ప్రయాణికులకు రవాణా సదుపాయాలను పెంచడంలో భాగంగా సోమవారం నుంచి 71 అన్రిజర్వ్డ్ రైలు సర్వీసులు నడుపనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్రిజర్వ్డ్ మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపనున్నట్టు పేర్కొన్నారు. టికెట్ బుకింగ్ కోసం ప్రయాణికులు కౌంటర్ల వద్ద గుమిగూడకుండా ఉండేందుకు.. ‘యూటీఎస్ ఆన్ మొబైల్’ యాప్ సేవలను మళ్లీ తీసుకురానున్నట్టు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
దీదీ.. మీరు వారణాసిలో పోటీ పడొచ్చు!
ఉద్యోగం నుంచి ప్రొఫెసర్ సాయిబాబా తొలిగింపు
సుప్రీంకోర్టుకు ‘ఇస్రో కుట్ర కేసు’ నివేదిక