మహబూబాబాద్, మార్చి 31 : కెనడాలో బాబు.. మహబూబాబాద్లోని అనాథాశ్రమాల్లో చిన్నారి పుట్టిన రోజు వేడుకలను అమ్మమ్మ-తాతయ్య, గుండా మధురెడ్డి-పుష్ప దంపతులు ఆత్మీయులైన ఆనాథల మధ్య ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన మధురెడ్డి ప్రముఖ వ్యాపారస్తులు.. మధురెడ్డి-పుష్ప దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. ఒకరు యూఎస్లో, మరోకరు కెనడాలో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు. కాగా, చిన్న కూతురు నిహారిక-రవితేజరెడ్డి కుమారుడు శ్రే యాన్స్ రెడ్డి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలనుకున్నారు. అయితే కెనడాలో కరోనా విజృంభిస్తున్న ఇండియాకు రాలేకపోయారు. కాగా, శ్రేయాన్స్ పుట్టినరోజు వేడుకలను అమ్మమ్మ-తాతలకు మండలంలోని సికింద్రాబాద్తండాలోని ఆదరణ వృద్ధ్దుల ఆశ్రమం, జిల్లా కేంద్రంలో ఉన్న దైవకృప అనాథాశ్రమాల్లో శ్రేయాన్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆశ్రమంలో పండ్లు, నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రేయాన్స్ తాతయ్య మధురెడ్డి మా ట్లాడుతూ అనాథాశ్రమం నిర్వహణ ఉన్నంతకాలం పిల్లలు, వృద్ధుల కోసం సబ్బులను దానం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రంజిత్, వీరన్న, మోహన్, వెంకన్న పాల్గొన్నారు.