ముంబై, జూన్ 17: దేశీయ కరెన్సీకి ఫెడ్ సెగ గట్టిగానే తాకింది. మార్కెట్ అంచనాలకంటే ముందుగానే వడ్డీ రేట్లను పెంచనున్నట్లు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో భారత కరెన్సీ రూపాయి భారీ పతనాన్ని చవిచూసింది. గురువారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్ఛేంజ్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 76 పైసలు (1 శాతంపైగా) క్షీణించి 74.08 వద్దకు పడిపోయింది. ఇంత పెద్ద పతనాన్ని చవిచూడటం గత రెండు నెలల్లో ఇదే తొలిసారి. కరోనా సంక్షోభంతో జీరో స్థాయికి రేట్లను తగ్గించిన ఫెడ్ 2024లో తిరిగి పెంచవచ్చన్న అంచనాలు మార్కెట్లో వుండగా, 2023లోనే పెంచే సంకేతాల్ని ఇవ్వడంతో డాలరు విలువ జోరుగా పెరిగింది. తాజా పతనంతో మొత్తం 8 రోజుల్లో రూపాయి 128 పైసలు నష్టపోయినైట్లెంది.