దుర్గమారణ్యంలో బతుకుపోరుకు అక్షరరూపమిస్తూ రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ అదే పేరుతో సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వైష్ణవ్తేజ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలో వైష్ణవ్తేజ్ ఫస్ట్లుక్ను విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రంలో ఓబులమ్మ పాత్రను పోషిస్తున్న కథానాయిక రకుల్ప్రీత్సింగ్ తొలిచిత్రాన్ని సోమవారం రిలీజ్ చేశారు. ఇందులో ఆమె లంగావోణి ధరించి పల్లెటూరి యువతిగా కనిపిస్తోంది. వైష్ణవ్తేజ్, రకుల్ప్రీత్సింగ్ నడుమ ప్రణయాన్ని ఆవిష్కరిస్తూ విడుదల చేసిన ఫస్ట్గ్లిమ్స్ ఆకట్టుకునేలా ఉంది. అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్రెడ్డి, కథ: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి.