హైదరాబాద్ : కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం మెట్పల్లి, కోరుట్ల ప్రభుత్వ దవాఖానల్లో మరిన్ని కరోనా టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచనుంది. ఈ రెండు దవాఖానల్లో రేపటి నుంచి 7500 కిట్లు అందుబాటులో ఉండనున్నాయి.
కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో కరోనా పరీక్షలు చేసేందుకు తగినన్ని కిట్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పలువురు ట్విట్టర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత దృష్టికి తెచ్చారు.
వెంటనే స్పందించిన ఆమె వైద్యారోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు, జగిత్యాల కలెక్టర్లను సమస్యను పరిష్యరించాలని కోరారు.
దీంతో మంత్రి ఈటల కరోనా కిట్ల విషయాన్ని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే సమకూర్చారు.
నిజామాబాద్ జిల్లా సిరికొండ పీహెచ్సీకి అంబులెన్స్ కేటాయించాలని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కవితకు విన్నవించారు.
వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడి అంబులెన్స్ మంజూరు చేయించారు. దీంతో ప్రజలు, స్థానిక నాయకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి