నాగర్కర్నూల్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : పల్లె ప్రగతితో గ్రామాల్లో ఓవైపు పారిశుధ్య సమస్య తీరుతుండగా.. మరోవైపు ప్రజారోగ్యమూ మెరుగుపడుతున్నది. రెండేండ్లలో చేపట్టిన పారిశుధ్య పనులతో సీజనల్ రోగాలు దూరమయ్యాయి. నల్లమల అటవీ ప్రాంతాల్లో సాధారణమైన మలేరియా, డెం గీ వంటి రోగాలను ప్రజలు దాదాపుగా మర్చిపోయారు. ఫలితంగా గ్రామాలు ఆరోగ్య పల్లెలుగా మారుతున్నాయి. రెండేండ్లుగా సీజనల్ వ్యాధులు భారీగా తగ్గుముఖం పట్టడం గమనార్హం. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం పారిశుధ్య పనులు చేపడుతున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం పాల్గొంటుండడంతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో మురుగు కా ల్వలను శుభ్రం చేస్తున్నారు. ఇండ్ల మధ్య మురుగు గుంతలు లేకుండా మట్టి వేసి చదును చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేస్తున్నారు. ఇండ్ల మధ్య ఉన్న పాత ఇండ్లను కూల్చివేయడంతో పందులు ఊరికి దూరంగా తరలివెళ్లాయి. పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లను సైతం జేసీబీలతో తొలగిస్తున్నారు. నీ టి ట్యాంకుల వద్ద మురుగు నీరు నిలువ ఉండకుం డా చర్యలు తీసుకుంటున్నారు. వాటర్ ట్యాంకులను తరచూ శుభ్రం చేస్తున్నారు.
ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఫాగిం గ్ చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్య సమస్య తీరుతున్నది. పంచాయతీలకు ప్రతి నెలా నిధులు మంజూరు చేయడంతోపాటు తడి, పొడి చెత్తను ప్ర భుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్ ద్వారా ప్రతిరో జూ సేకరించి డంపింగ్ యార్డులకు చేరవేస్తున్నారు. ఈ కారణంగా గ్రామాల్లో, ఇండ్ల మధ్య చెత్త కుప్ప లు కనిపించడం లేదు. దీంతో కుక్కలు, పందులకు ఆవాసాలు లేకుండా పోయాయి. ఇలా పల్లె ప్రగతితో గ్రామాల్లో అపరిశుభ్రత దూరమవుతున్నది. ఫలితంగా ప్రతి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధు లు సైతం దూరమయ్యాయి. నల్లమల అటవీ ప్రాం తాల్లోనూ ఈ వ్యాధులు నమోదు కాకపోవడం విశేషం. మలేరియా, డెంగీ, చికున్ గున్యా, పైలేరి యా, జపనీస్ ఎన్సెఫాలిటీస్ (జేఈ) వ్యాధిగ్రస్తులు సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారు. అలాగే కరోనా కంటే ముందు ఆందోళన కలిగించిన హెచ్1 ఎన్1 వైరస్ సంక్రమిత స్వైన్ఫ్లూ సైతం దూరమైంది. ఇక కలుషిత నీటి సంక్రమిత అతిసార, విరేచనాలు, టై ఫాయిడ్ వంటి వ్యాధులూ భారీగా తగ్గుముఖం ప ట్టాయి. నీళ్ల ట్యాంకుల వద్ద మురుగు తొలగించ డం, నీళ్లల్లో బ్లీచింగ్ చల్లడం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ జలం సరఫరా అవుతుండడం దీ నికి కారణం. ఫలితంగా గ్రామీణ పల్లెలు ఆరోగ్యం గా మారాయి. వీటితోపాటు పిచ్చిమొక్కలు, పాడుబడ్డ ఇండ్లు, బావులు తొలగించడంతో పాములు, తేళ్ల వంటి విషపురుగుల సంచారం తగ్గింది.
నాగర్కర్నూల్ జిల్లాలో ఇలా..
ఈ ఏడాది ఇప్పటివరకు నాగర్కర్నూల్ జిల్లాలో ఒకే ఒక్క డెంగీ కేసు తప్ప ఎలాంటి సీజనల్ వ్యా ధులు రాలేదు. పైలేరియా కేసులు 2018లో 122 నమోదు కాగా.., ఆ తర్వాత ఒక్కరికీ ఈ వ్యాధి సోకలేదు. జేఈ వ్యాధి 2019లో ఒక్క కేసు తప్ప జిల్లాలో కనిపించలేదు. గతంలో ఆందోళన కలిగించిన స్వైన్ ఫ్లూ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. టై ఫాయిడ్ కేసులు ఈ నాలుగేండ్లలో ఐదు మాత్రమే నమోదయ్యాయి. అతిసార కేసులు ఆందోళనకరం గా కనిపించినా వ్యాధి తీవ్రత బాగా తక్కువ. మా మూలు లక్షణాలతోనే ప్రజలు కోలుకున్నారు. పా ము, కుక్కకాట్లు, అతిసార, విరేచనాలు ఈ ఏడాది లో ఇప్పటివరకు నమోదు కాలేదు.