బాలీవుడ్ డ్రామా క్వీన్ రాఖీ సావంత్ తరచూ ఏదో ఒక కారణంతో హెడ్లైన్స్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మరో లెవల్లో ఉంటుంది. ఆ మధ్య డ్రగ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రాశీ సావంత్ రీసెంట్గా తన ఇంట్లోకి అజ్ఞాతవ్యక్తి వచ్చాడని కామెంట్స్ చేసి ఆశ్చర్యపరిచింది. ‘మైన్ హూన్ నా’ మరియు ‘దిల్ బోలే హడిప్ప’, ‘జోరు కా గులాం’, ‘ఏక్ కహానీ జూలీ కి’ మరియు ‘బుద్ధ మార్ జయేగా’ వంటి అనేక బాలీవుడ్ చిత్రాలలో కూడా కీలక పాత్రలు పోషించిన రాఖీ సావంత్ ‘బిగ్ బాస్ 14’ లో పాల్గొన్నప్పటి నుంచి బాగా ఫేమస్ అయ్యారు.
బిగ్ బాస్ 14 లో తాను రూ. 14లక్షలు తీసుకొని బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు తనను బిగ్ బాస్ 15 ఓటీటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. రాఖీ మంగళవారం స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించి ముంబై వీధుల్లో తిరుగుతూ హల్చల్ సృష్టించింది. డ్యాన్స్లు చేస్తూ, సూట్ కేసులు, స్పీకర్స్ పట్టుకొని తెగ సందడి చేసింది.
స్పీకర్ పెట్టుకొని తను డ్యాన్స్లు చేస్తుంటే చుట్టు పక్కల వారు చూసి ఆశ్చర్యపోయారు. బిగ్ బాస్ షో అంటే తనకు ఇష్టమని, సిద్ధార్థ్ శుక్లా.. షెహ్నాజ్ గిల్ లను ఆహ్వానించి.. తనను ఎందుకు ఆహ్వానించలేదని ఆమె ప్రశ్నించింది. తాను స్పైడర్-ఉమెన్ అని స్పైడర్ వెబ్లతో తన ప్రత్యర్థులను నాశనం చేస్తానని బిగ్ బాస్కు చెప్పింది. ప్రస్తుతం రాఖీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి.