కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ఇండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ భావోద్వేగానికి గురయ్యారు. తన మనస్సులో మాట బయట పెట్టారు. ఈ మేరకు బుధవారం ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేస్తూ.. వచ్చే మూడు జన్మల్లోనూ నీలిరంగు జెర్సీలో క్రికెట్ ఆడాలని కోరుకున్నాడు. అంటే టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలని ఆశతో ఉన్నట్లు తెలిపాడు.
ప్రపంచంలోని గొప్ప క్రికెటర్లు, సారథుల్లో సౌరవ్ గంగూలీ ఒకరు. క్రికెట్ అభిమానులు దాదాగా పిలుచుకునే సౌరవ్ గంగూలీ..1992 నుంచి 2008 వరకు 424 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 41.46 సగటుతో 18,575 పరుగులు చేశారు. 38 సెంచరీలు కొట్టారు.
జట్టుకు కీలక అవసరాలు వచ్చినప్పుడు బౌలింగ్ చేశారు. 132 వికెట్లు పడగొట్టారు. కెరీర్లో 228 మ్యాచుల్లో టీమ్ ఇండియాకు సారథ్యం వహించాడు. 2003 వన్డే ప్రపంచకప్లో జట్టును రన్నరప్గా నిలిపారు.
అంతకుముందు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో టీమ్ ఇండియా జట్టు డీలా పడింది. కానీ ఆయన జట్టు సభ్యుల్లో ధైర్యం నింపి దూకుడు నేర్పారు. ఆటకు వీడ్కోలు పలికాక క్రికెట్ పాలనలోనూ రాణిస్తున్నారు.
‘మరో మూడు జన్మల్లోనూ నేనిదే చేయాలని అనుకుంటున్నాను’ అని దాదా తన మనసులోని కోరికను బయటపెట్టారు. నీలిరంగు జెర్సీ ధరించి సొగసరి లాఫ్టెడ్ షాట్ కొట్టిన చిత్రాన్ని ఇన్స్టాలో పంచుకున్నారు.
2007లో పాక్పై అతడు చివరి వన్డే ఆడాడం గమనార్హం. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడుగా పనిచేస్తున్న గంగూలీకి ఇటీవల గుండెనొప్పి రావడంతో శస్త్రచికిత్సలు చేయించుకున్న సంగతి తెలిసిందే.
తరుణ్ తేజ్పాల్పై లైంగిక వేధింపుల కేసు.. విచారణ మే 21కి వాయిదా..!
ఐటీ కొలువుల మేళా : క్రెడిట్ సూస్ లో 1000కి పైగా టెకీల నియామకం!
క్రిప్టోకరెన్సీకి ట్విట్టర్ సీఈఓ వెన్నుదన్ను
తౌటే తుఫాన్: తౌటే అంటే అర్థం తెలుసా..?
కుటుంబాలకు ‘జంట’ సవాళ్లు.. పెరిగిన ఇంధన, హెల్త్కేర్ ఖర్చు!!
క్రిప్టో బిజినెస్పై డ్రాగన్ నిషేధం! ఎలాగంటే!!
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
డొనాల్డ్ ట్రంప్పై క్రిమినల్ ఇన్వేస్టిగేషన్..