చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలకడగా ఆడుతోంది. జేసన్ హోల్డర్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికే బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ(33) ఔటయ్యాడు. హోల్డర్ వేసిన షార్ట్ బాల్ను భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. లాంగ్ లెగ్లో విజయ్ శంకర్ ముందుకు పరుగెత్తుకుంటూ వచ్చి అద్బుత క్యాచ్ అందుకోవడంతో విరాట్ నిరాశగా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్(1) తర్వాతి ఓవర్లో రషీద్ ఖాన్ కళ్లు చెదిరే బంతికి పెవిలియన్ చేరాడు. 14 ఓవర్లకు బెంగళూరు 4 వికెట్లకు 96 పరుగులు చేసింది. ప్రస్తుతం మాక్స్వెల్(30), వాషింగ్టన్ సుందర్(1) క్రీజులో ఉన్నారు.