సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరీక్షల కోసం ఇటీవల ప్రత్యేక ఫ్లైట్లో అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో కేంద్రం అనుమతులు తీసుకొని మరీ ప్రత్యేక ఫ్లైట్లో అమెరికాకు వెళ్లడంతో అభిమానులు కంగారు పడ్డారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలు చూసి ఫ్యాన్స్ కొంత శాంతించారు.
తన కుమార్తె ఐశ్వర్యా ధనుష్తో కలిసి రజనీ నడుచుకుంటూ వస్తున్న ఫొటోతో పాటు, లోకల్ మెట్రోలో రజనీకాంత్ ప్రయాణిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పిక్స్ చూసి రజనీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని అంటున్నారు. జూలై 8న రజనీకాంత్ ఇండియాకి రానున్నట్టు తెలుస్తుంది. కాగా, రజనీకాంత్ నటించిన అన్నాత్తె చిత్రం నవంబర్ 4న విడుదల కానుందని సమాచారం.