అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 83,690 శాంపిల్స్ పరీక్షించగా 8,976 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. నిన్న ఒక్కరోజే కొవిడ్తో 90 మంది మృతిచెందినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో 13,568 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 123426 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 11466కు చేరింది. ఇవాళ్టి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1758339 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.