ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ ఆనంద్ మృతిపై తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన అకాల మరణం ఎంతగానో బాధించింది అని పలువరు ప్రముఖులు తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన ట్విట్టర్లో గౌరవనీయులైన కేవీ ఆనంద్ మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. మనందరిని విడిచి వెళ్లడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ రజనీకాంత్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
నా తొలి మూవీ సినిమాటోగ్రాఫర్ అకాల మరణం చెందడం షాక్కు గురి చేసింది. ఆయన మరణించారనే వార్తని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం. అతనికి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను అంటూ విశాల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇక దర్శకుడు శంకర్ తన ట్వీట్లో ఈ వార్త నిజంగా షాకిచ్చింది. నా హృదయం చాలా భారంగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. అద్భుతమైన సినిమాటోగ్రాఫర్, దర్శకుడిని కోల్పోయాను. ఈ నష్టాన్ని ఎప్పటికీ భర్తి చేయలేము. నా ప్రియమైన స్నేహితుడి మృతికి సంతాపం తెలియజేస్తున్నాను అని శంకర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇవికూడా చదవండి
కరోనా సోకి తీహార్ జైల్లో నలుగురు ఖైదీలు మృతి
పీఎం కేర్స్ కొవిడ్ ఆస్పత్రికి 57 మంది సభ్యుల నేవీ వైద్య బృందం
మహారాష్ట్రలో కరోనా ఆంక్షలు పొడిగింపు
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
ఆసిఫాబాద్లో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
నెట్టుంటే.. నట్టింట్లోనే వైద్యం
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం