న్యూఢిల్లీ: సౌరాష్ట్ర మాజీ క్రికెటర్, బీసీసీఐ మ్యాచ్ రిఫరీ రాజేంద్రసిన్హా జడేజా మృతిచెందారు. సౌరాష్ట్రలో అత్యంత గొప్ప క్రికెటర్లలో ఒకరైనా రాజేంద్ర కరోనా మహమ్మారితో పోరాడుతూ ఆదివారం కన్నుమూశారు. జడేజా అకాల మరణానికి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సంతాపం తెలిపింది. 1974-75 to 1986-87 మధ్య క్రికెట్ ఆడిన జడేజా చాలా మ్యాచ్ల్లో ఆల్రౌండర్గా అద్భుత ప్రదర్శన చేశాడు.
రాజేంద్రసిన్హా 50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 11 లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 134 వికెట్లు, లిస్ట్-ఏ క్రికెట్లో 14 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 1536 పరుగులు చేయగా, లిస్ట్-ఏ గేమ్ల్లో 104 రన్స్ సాధించాడు. సౌరాష్ట్ర క్రికెట్ సంఘంలో సెలెక్టర్, కోచ్, టీమ్ మేనేజర్గా కూడా పనిచేశారు.