ఆది సాయికుమార్, పాయల్రాజ్పుత్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కిరాతక’. ఎం.వీరభద్రమ్ దర్శకుడు. నాగం తిరుపతిరెడ్డి నిర్మాత. ఆగస్ట్ 13 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. గురువారం ఫస్ట్లుక్ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశమిది. ఆది పాత్ర సరికొత్త కోణంలో సాగుతుంది. పాయల్రాజ్పుత్ పాత్ర ప్రేక్షకుల్ని థ్రిల్కు గురిచేస్తుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది’ అన్నారు. ‘ఈ కథ నాకు బాగా నచ్చింది. అభినయానికి మంచి ఆస్కారం ఉన్న పాత్ర దొరకడం సంతోషంగా ఉంది’ అని కథానాయిక పాయల్రాజ్పుత్ పేర్కొంది. నిర్మాత మాట్లాడుతూ ‘టైటిల్కు మంచి స్పందన లభిస్తోంది. వైవిధ్యమైన క్రైమ్ థ్రిల్లర్గా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. పూర్ణ, దాసరి అరుణ్కుమార్, దేవ్గిల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రామ్రెడ్డి, సంగీతం: సురేష్ బొబ్బిలి, నిర్మాణ సంస్థ: విజన్ సినిమాస్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఎం.వీరభద్రమ్.