రాజశేఖర్ కథానాయకుడిగా నటించనున్న తాజా చిత్రం ‘మర్మాణువు’. వెంకటేష్ మహా (‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్) దర్శకుడు. పెగాసన్ సినీ కార్ప్ ఎల్ఎల్పి, మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. విజయ ప్రవీణ, శివాని, శివాత్మిక నిర్మాతలు. ఇటీవలే ఈ సినిమా ప్రకటనతో పాటు టైటిల్ను ఖరారు చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘కథానుగుణంగా చక్కటి టైటిల్ కుదిరింది. యూనివర్సల్ కథాంశమిది. రాజశేఖర్ పాత్ర చిత్రణ మునుపెన్నడూ చూడని విధంగా సాగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్నందించబోతున్నారు. రచన-దర్శకత్వం: వెంకటేష్ మహా.