ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ (రౌద్రం రణం రుధిరం ) విడుదల వాయిదా పడింది. తొలుత ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే కరోనా ప్రభావంతో పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాకపోవడంతో సినిమా రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ‘నిర్మాణానంతర కార్యక్రమాలు దాదాపు పూర్తయ్యాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు ఇంకా తెరచుకోలేదు. అందుకే కొత్త విడుదల తేదీని ఇప్పుడే ప్రకటించలేకపోతున్నాం. ప్రపంచ సినిమా మార్కెట్ అంతా సాధారణ స్థితికి చేరుకున్నాక సినిమా విడుదల తేదీపై ఓ నిర్ణయానికొస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.