ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని పెంచిన విషయం తెలిసిందే. రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దృష్టి నెలకొని ఉంది. ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, అక్టోబర్ 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రాజమౌళి మహేష్ బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు కాగా, విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇందులోమహేష్తో పాటు మరో స్టార్ హీరో కూడా నటిస్తారట.
ఆర్ఆర్ఆర్ మాదిరిగానే ఈ చిత్రాన్ని మల్టీ స్టారర్గా రూపొందిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. హాలీవుడ్ మూవీ ‘ఇండియానా జోన్స్ తరహాలో తెరకెక్కించబోతున్నట్టు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే కదా. ఈ జానర్ మహేష్ బాబు కు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.