చిక్కడపల్లి, మే 23: మాజీ కార్పొరేటర్ మజ్జిగ ప్రభాకర్ రెడ్డి గత మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. కాగాప్రభాకర్ రెడ్డి సతీమణి విమలారెడ్డి, కుమారుడు దిగ్విజయ్ రెడ్డిలను ఆదివారం ఎమ్మెల్యే ముఠాగోపాల్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.వివేక్, ప్రధాన కార్యదర్శి సిరిగిరి కిరణ్కుమార్, జయదేవ్ పాల్గొన్నారు.
కవాడిగూడ, మే 23: బీజేపీ ముషీరాబాద్ సీనియర్ నాయకుడు రమేశ్రామ్ తండ్రి మల్లెంపేట సత్యనారాయణ ఇటీవల మృతిచెందడంతో ఆదివారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కవాడిగూడలోని రమేశ్రామ్ను ఆయన స్వగృహంలో కలిసి పరామర్శించారు. టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, భోలక్పూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాస్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు సాయి, శైలేందర్, రాంబాబు, వెంకట్, ప్రసాద్, మహ్మద్ అలీ పాల్గొన్నారు.