త్వరలో సినిమా థియేటర్లు రీఓపెన్ అవుతుండటంతో ప్రమోషన్లు షురూ చేస్తున్నారు టాలీవుడ్ హీరోలు. యువ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాజ రాజ చోర’. హసిత్ గోలి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మేఘా ఆకాశ్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్ సాంగ్ విడుదల విషయాన్ని షేర్ చేస్తూ ఫన్నీ ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. పాట ఎక్కడ భాస్కర్ అంటూ మేఘా ఆకాశ్, సునయన, గంగవ్వ అడుగుతుంటే..హే పీపుల్ పాట కోసం ఎదురుచూస్తున్నారా..నేను పాటను దొంగతనం చేశానని శ్రీ విష్ణు అంటున్నాడు. చోరీ చేసిన రాజ రాజు వచ్చే పాటను జులై 28న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు మేకర్స్.
ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా కీర్తి చౌదరి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రాజ రాజ చోరలో రవిబాబు, కాదంబరి కిరణ్, తనికెళ్ళ భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, వాసు, గంగవ్వ, ఇంటూరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇవి కూడా చదవండి..
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్