ముంబై: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రా .. పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో రెండు బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని ముంబై క్రైం బ్రాంచీ పోలీసులు ఆదేశించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. ఆ రెండు అకౌంట్లలో కోట్లాది రూపాయాలు డిపాజిట్ అయినట్లు ఎస్బీఐ అధికారులు వెల్లడించారు. ఆదివారం బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. రాజ్కుంద్రాకు చెందిన ప్రొడక్షన్ కంపెనీని అరవింద్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి నడిపినట్లు గుర్తించారు. అయితే శ్రీవాత్సవ్ భార్య హర్షిత అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అరవింద్ రెండేళ్ల నుంచి ఇంటికి రావడంలేదని, కేవలం అకౌంట్కు డబ్బులు పంపిస్తున్నట్లు అతని తండ్రి తెలిపాడు. పోర్న్ వీడియోలు తీస్తున్న ఆరోపణలపై జూలై 19వ తేదీన రాజ్కుంద్రాను అరెస్టు చేశారు.