ప్రముఖ నటి మందిరా బేడి భర్త, ఫిల్మ్ మేకర్ రాజ్ కౌశల్(49) గుండెపోటుతో బుధవారం(జూన్ 30) కన్నుమూసిన విషయం విదితమే. ఈ క్రమంలో మందిరా తానే భర్తకు అంత్యక్రియలు నిర్వహించారు. వీరికి పదేళ్ల కుమారుడు వీర్, దత్తత కూతురు తార ఉన్నారు. శనివారం తన ఇంట్లో రాజ్ కౌశల్ ప్రార్ధనా సమావేశం నిర్వహించింది మందిరా. ఈ కార్యక్రమానికి పలువురు టీవీ స్టార్స్తో పాటు మౌని రాయ్ కూడా హాజరైంది.
1999లో మందిరా, రాజ్ కౌశల్ వివాహం చేసుకోగా, వీరికి2011లో వీర్ జన్మించారు.ఇప్పుడు వీర్కి పది సంవత్సరాలు కాగా, ఆయన తండ్రి అంత్యక్రియలను నిర్వహించలేదు. మందిరా బేడీనే అన్నీ తానై అంత్యక్రియలు చేసింది. అయితే అంత్యక్రియల సమయంలో మందరి జీన్స్.. టీ షర్టు, చెప్పులు, చేతికి వాచీ ధరించి స్టైలిష్గా ఉండడంతో కొందరు నెటిజన్స్ ఆమెని ట్రోల్ చేశారు. భర్తపై ఆమె ప్రేమను చూడాలే తప్ప.. ఇలా విద్వేషపూరితంగా వ్యవహరించడం సరికాదని మరికొందరు విజ్ఞప్తి చేసారు.