కరోనా మహమ్మారి దేశాన్ని ఎంతగా కుదిపేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైరస్ వలన ఎందరో బతుకులు చిన్నాభిన్నం అయ్యాయి. కరోనా బారిన పడ్డవారు వైద్యం అందక లబోదిబోమంటున్నారు. ఇలాంటి వారికి తమవంతు సాయం అందించేందుకు సినీ సెలబ్రిటీలు నడుం కట్టారు. తాజాగా రాధేశ్యామ్ నిర్మాతలు కొవిడ్ బాధితుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న రాధే శ్యామ్ సినిమాలో హాస్పిటల్ సీన్ కోసం 50 సెట్ ప్రాపర్టీలను రూపొందించారు. ఇందులో బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, స్ట్రెచర్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయట. వీటన్నింటిని 9 పెద్ద ట్రక్లు ఉపయోగించి ఆసుపత్రికి చేర్చారట రాధే శ్యామ్ నిర్మాతలు. వారు చేసిన పనికి ప్రశంసలు లభిస్తున్నాయి. కాగా, రాధే శ్యామ్ చిత్రాన్ని జూలై 30న విడుదల చేస్తామని మేకర్స్ ముందుగా ప్రకటించిన ఆ సమయానికి మూవీ రిలీజ్ కావడం కష్టమే అనిపిస్తుంది.