మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో మారుతి తెరకెక్కించిన చిత్రం ప్రతి రోజు పండగే. ఇందులో ఏంజెల్ ఆర్నా పాత్రలో కనిపించి అదరగొట్టింది రాశీ ఖన్నా. ఆమె పర్ఫార్మెన్స్కు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఈ క్రమంలో మరోసారి తన సినిమాలో హీరోయిన్గా రాశీ ఖన్నాను ఎంపిక చేశాడు మారుతి. తాజాగా సెట్లో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. పక్కా కమర్షియల్ చిత్రంతో ఏంజెల్ ఆర్నా బ్యాక్ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు గోపిచంద్ హీరోగా పక్కా కమర్షియల్ అనే చిత్రం చేస్తున్నాడు. అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.
పక్కా కమర్షియల్ చిత్రం గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా రూపొందుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ఫుల్ బ్యానర్స్ జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ చిత్ర విడుదల తేదీని వినూత్నంగా ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు మారుతి.