తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు రాజకీయ నాయకులతో కూడా మంచి సంబంధాలున్నాయి. తమ సినిమాలు తాము చేసుకుంటూనే..పొలిటికల్ గానూ బాగానే రిలేషన్ మెయింటేన్ చేస్తుంటారు. అందులోనూ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలకు పొలిటికల్ బ్యాగ్రౌండ్ కూడా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవిని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేకంగా కలిసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ మంత్రి ఏంటి.. చిరు, ఎన్టీఆర్ ను కలవడం ఏంటి అంటూ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కొన్ని గంటల వ్యవధిలోనే ఎన్టీఆర్, చిరును తమ తమ ఇళ్లలోనే ప్రత్యేకంగా కలిసారు. దానికి కారణం ఆయన తనయుడు నయన్ రాజ్ పుట్టిన రోజు కావడమే. డాక్టర్ నయన్ రాజ్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులను కలిసాడు అజయ్.
జూనియర్ ఎన్టీఆర్ అంటే మంత్రి తనయుడు నయన్ రాజ్ కు అభిమానం అని.. అలాగే చిరంజీవి అంటే కూడా చాలా యిష్టం అని.. అందుకే ఈ ఇద్దరు హీరోలను పుట్టిన రోజు నాడు కలిసాడని తెలుస్తుంది. అయితే మంత్రి స్వయంగా తనయుడితో కలిసొచ్చి హీరోలను కలవడంపై మాత్రం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. హీరోలను మాత్రమే కాదు..మంత్రి కేటీఆర్ ను సైతం తనయుడితో కలిసి భేటీ అయ్యాడు పువ్వాడ అజయ్.
ఇవి కూడా చదవండి..
ఇంట్రెస్టింగ్ గా నందమూరి హీరో ప్రీ లుక్
ఆర్ఆర్ఆర్ నిర్మాతతో నాగచైతన్య సినిమా..!
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత