టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పుష్ప. రష్మిక మందన్నా హీరోయిన్. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో మధ్యలో షూటింగ్ నిలిచిపోయింది. లాక్ డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ సినిమా షూటింగ్స్ ఊపందుకున్నాయి. తాజాగా పుష్పరాజ్ అండ్ టీం చిత్రీకరణ మొదలుపెట్టినట్టు మేకర్స్ తెలిపారు. హైదరాబాద్లో షూటింగ్ షురూ కాగా..అల్లు అర్జున్, రష్మిక ఇతర తారలపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప చిత్రంలో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. పుష్ప రెండు పార్టులుగా రానుంది. మరోవైపు పుష్ప ప్రాజెక్టులో సునీల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ నడుస్తోంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత మళ్లీ పుష్పరాజ్ టీం నుండి అప్ డేట్ రావడంతో సంతోషంలో మునిగిపోతున్నారు సినీ లవర్స్.
ఇవి కూడా చదవండి..
రిస్క్ తీసుకునే మూడ్లో లేని టాలీవుడ్ నిర్మాతలు..?
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
‘డెవిల్’గా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ అదిరింది..వీడియో
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న