కోల్కతా: బెంగాల్లో గవర్నర్ జగదీప్ ధంకర్కు, సీఎం మమత బెనర్జీకి మధ్య కోల్డ్వార్ కొనసాగుతూనే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఘనవిజయం సాధించి పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే నారద టేపుల కేసులో ఇదివరకటి మమత ప్రభుత్వంలోని నలుగురిపై సీబీఐ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి జారీ చేయడంపై వివాదం రగులుకుంటున్నది. అందులో ఇద్దరు (సుబ్రత ముఖర్జీ, ఫిర్హాద్ హకీం) సోమవారం నాటి విస్తరణలో మంత్రి పదవులు పొందడం గమనార్హం. గవర్నర్ అనుమతి ఇవ్వడం, అదీ ఈ సమయంలో ఇవ్వడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమంటే సువేందు అధికారి ప్రాసిక్యూషన్పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడి చేయకపోవడం. నారద టేపుల కుంభకోణం జరిగిన సమయంలో తృణమూల్ ఎంపీగా ఉన్న సువేందు ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి మంజూరు చేసిన మరో ఇద్దరు మాజీ మంత్రుల్లో మదన్ మిత్రాకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మరో మంత్రి సోవన్ చటర్జీ తృణమూల్ నుంచి 2019 ఆగస్టులో బీజేపీలోకి మారిపోయారు. తర్వాత అందులో నుంచి కూడా బయటకు వచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. గవర్నర్ ్నుమతి కథలో ఇంకో ట్విస్టు కూడా ఉంది. లోక్సభ సభ్యుల ప్రాసిక్యూషన్కు స్పీకర్ అనుమతి తప్పనిసరి. అలాగే ఎమ్మెల్యేల ప్రాసిక్యూషన్ కు అసెంబ్లీ స్పీకర్ అనుమతి కావాలి. కానీ ఎందువల్లనో సీబీఐ ఆ మార్గంలో వెళ్లకుండా మంత్రుల ప్రాసిక్యూషన్ అంటూ గవర్నర్ దగ్గరకు వెళ్లింది. ఆరుగురు ఎంపీలు, నలుగురు మంత్రులు లంచం తీసుకోవడం నారద టేపుల్లో రికార్డు అయింది. అందులో ఒకరు చనిపోయారు. కొందరు పార్టీలు మారారు.