సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు పుష్ప. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. సుకుమార్ అండ్ టీం నెక్ట్స్ షెడ్యూల్ ను గోవాలో జరిపేందుకు రెడీ అవుతున్నారు. గోవాలోని పలు లొకేషన్లలో సుమారు 30 రోజుల పాటు కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. జులై 5 నుంచి పుష్పరాజ్ టీం షూట్ లో పాల్గొనబోతుంది.
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా ఇప్పటివరకు ఎవరు అంతగా గుర్తించని లొకేషన్ల వేటలో సుకుమార్ ఉన్నాడని లేటెస్ట్ టాక్. ఈ షెడ్యూల్ పుష్పరాజ్ పై ఓ పాటను కూడా షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేసేలా దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాటను కంపోజ్ చేసి..సినిమాకే హైలెట్ గా నిలిచేలా రూపొందించాడని ఇన్సైడ్ టాక్.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది.
ఇవి కూడా చదవండి..
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
Recommended Content by ntnews.com
Recommended Content by ntnews.com