అల్లు అర్జున్, రష్మిక మంధాన ప్రధాన పాత్రలలో లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ని ”పుష్ప: ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
పుష్ప సినిమాకు సంబంధించిన వార్తలు, మూవీకి సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి. అయితే ఈ సినిమా కథకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది రివేంజ్ డ్రామా అని అందరు భావించగా, ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తుంది. ఇందులో అల్లు అర్జున్ ఇల్లీగల్ ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ చేస్తుంటాడని.. ఈ క్రమంలో స్మగ్లింగ్ చేస్తూ ఓ పెద్ద డాన్ లా ఎలా ఎదిగాడానేది ఫస్ట్ పార్ట్ లో చూపిస్తారని టాక్ నడుస్తోంది.
కేజీఎఫ్ తరహాలోనే పుష్ప సినిమా ఉంటుందని, ఆ క్రమంలోనే ఈ సినిమాకి ”పుష్ప: ది రైజ్” అనే టైటిల్ పెట్టారని అంటున్నారు. సెకండ్ పార్ట్ లో డాన్ అయిన తర్వాత పరిస్థితులను చూపించబోతున్నారట. చిత్రంలో అల్లు అర్జున్ రాయలసీమ ప్రాతంలో చిత్తూరు యాస మాట్లాడుతూ కనిపిస్తాడని సమాచారం. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ,జగపతిబాబు , సునీల్ ,అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఫస్ట్ పార్ట్ 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా, సెకండ్ పార్ట్ 30 శాతం పూర్తైంది.