టాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ హీరోకి దక్కని అరుదైన గౌరవం అల్లు అర్జున్ కి దక్కింది. ఈ ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా లేజర్, లైట్ షోలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద ఈ షో ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. రాత్రి 7గంటలకు పుష్ప లేజర్ మరియు లైట్ షో ప్రారంభం కానుంది. ఇలా ఓ హీరో బర్త్ డే కోసం లేజర్ షోని ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నారు ఫిలింనగర్ జనాలు. ఇప్పటికే ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పుష్ప టీజర్ లక్షల్లో వ్యూస్ ని అందుకుంటూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇంకోవైపు అర్థరాత్రి అల్లు అభిమానులు హీరో ఇంటిముందు టపాసులు పేల్చి బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. గతేడాది లాక్ డౌన్ వల్ల అల్లు అర్జున్ బర్త్ డేని జరుపుకోలేకపోయిన ఫ్యాన్స్ ఈసారి రెట్టించిన ఉత్సాహంతో హంగామా చేస్తున్నారు. హీరో పిలుపు మేరకు సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తూనే వేడుకలను ధూమ్ ధామ్ గా జరుపుకుంటున్నారు.