ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో పుష్ప ఒకటి. అల్లు అర్జున్,రష్మిక ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా అది రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ ఏడాది చివరలో కాని వచ్చే ఏడాది మొదట్లో కాని ఈ సినిమా విడుదల కానుంది.
పుష్ప సినిమాకు రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బర్త్డే సంగీతం అందిస్తుండగా, ఆయన బర్త్ డే నేడు కావడంతో అభిమానులు పుష్ప అప్డేట్ కోసం అప్డేట్స్ ఇవ్వాలని ఉదయం నుండి పోస్ట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో మైత్రిమూవీమేకర్స్ .. దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప సినిమా కోసం కంపోజ్ చేసిన తొలి పాట టైంకు ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తూ ఓ వీడియోని విడుదల చేసింది.
5 భాషలు,5 సింగర్స్ ,దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సింగిల్ ట్యూన్ ఆగస్ట్ 13న విడుదల కానున్నట్టు తెలియజేసారు. హిందీలో ఈ పాటను విశాల్ దడ్లాని, కన్నడలో విజయ్ ప్రకాశ్, మలయాళంలో రాహుల్ నంబియార్,తెలుగులో శివం,తమిళంలో బెన్నీ దయాల్ పాటని ఆలపించారు. తెలుగులో దాక్కో దాక్కో మేక పేరుతో ఈ పాట రూపొందింది.