తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో కొద్ది రోజుల పాటు ఈ కేసుకు సంబంధించి విచారణ జరగగా, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసును విచారిస్తోంది. ఇవాళ్టి నుంచి డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభం కానుంది. ఈరోజు నుంచి 12 మంది సినీ ప్రముఖులను విచారించనుండగా, తొలిరోజున దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈడీ విచారణకి హాజరయ్యారు.
ఉదయం 10.30 గంటలకు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా… 10.05 గంటలకే ఆయన వచ్చేశారు. ఆయనతో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా… పూరీ జగన్నాథ్ స్పందించలేదు. కారు దిగిన వెంటనే నేరుగా కార్యాలయంలోకి వెళ్లారు. మధ్యాహ్నం వరకు విచారణ సాగే అవకాశం ఉంది. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసులో నేటి నుంచి విచారణ ప్రారంభం కానుంది. జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని 8 మంది సభ్యుల టీం ప్రశ్నించనున్నారు.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ లైగర్ చిత్రంతో బిజీగా ఉండగా, ఆయన కొద్ది రోజుల క్రితం ముంబై వెళ్లారు.ఈడీ నోటీసులు పంపిన కారణంగా తిరిగి హైదరాబాద్కి వచ్చినట్టు తెలుస్తుంది. చివరిగా ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా చేస్తున్నాడు.
విచారణకు హాజరు కానున్న సెలబ్రిటీల విచారణ తేది:
1.పూరి జగన్నాథ్ – ఆగస్టు 31
2.ఛార్మి – సెప్టెంబర్ 2
3.రకుల్ప్రీత్ సింగ్ – సెప్టెంబర్ 6
4.రాణా దగ్గుబాటి – సెప్టెంబర్ 8
5.రవితేజ – సెప్టెంబర్ 9
6.శ్రీనివాస్ – సెప్టెంబర్ 9
7.నవదీప్ – సెప్టెంబర్ 13
8 ఎఫ్ క్లబ్ జీఎం – సెప్టెంబర్ 13
9.ముమైత్ ఖాన్ – సెప్టెంబర్ 15
10.తనీష్ – సెప్టెంబర్ 17
11.నందు – సెప్టెంబర్ 20
12.తరుణ్ – సెప్టెంబర్ 22