కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నాలుగు పదుల వయసులోనే గుండెపోటుతో మరణించి అందరికి తీరని విషాదాన్ని మిగిల్చాడు. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే ఆయన హఠాన్మరణం చెందడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ లేరనే డిప్రెషన్ లోకి వెళ్లి పోయి కొందరు అభిమానులు ఆత్మహత్య వరకు వెళ్తున్నారట. ఇప్పటి వరకు కన్నడ రాష్ట్రంలో పునీత్ రాజ్ కుమార్ మృతిని జీర్ణించుకోలేక 12 మంది మృతి చెందారు.
ఈ క్రమంలో పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని మాట్లాడారు. ఈ సమయంలో మీరు చూపిస్తున్న అభిమానానికి మేం ఎప్పుడు రుణపడి ఉంటాం. అప్పు మన మద్య లేకున్నా కూడా ఆయన మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పు ఎప్పుడు కూడా అభిమానులు సంతోషంగా ఉండాలని కోరుకునే వారు. ఆయన మరణం మా కుటుంబంకు పెద్ద లోటు. అలాంటి లోటు మీ కుటుంబంకు ఉండకూడదు. మీరు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకుని కుటుంబంను ఒంటరి చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్య ఆలోచన పెట్టుకోవద్దని.. దిగులుతో ఉండవద్దని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.