ములుగు (నమస్తే తెలంగాణ): మౌలిక వసతుల కల్పనతో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు బలోపేతం అవుతున్నాయని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ సెంటర్ను బుధవారం ఎంపీకవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్తో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. బడ్జెట్ కంటే అదనంగా 10 వేల కోట్లను ఆరోగ్యరంగానికి ఖర్చు పెట్ట డం ద్వారా వైద్యరంగం దశ మారనున్నదని చెప్పారు. రాష్ట్రంలో అందరికీ హెల్త్ ప్రొఫైల్ ఉండాలనే ఆలోచనతో రాజన్న సిరిసిల్లతోపాటు ములుగు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నానని తెలిపారు.