“సూర్యాస్తమయం’ సినిమాలో తన పాత్ర నిడివి తగ్గించారని దర్శకుడు, నటుడు బండి సరోజ్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు రఘు. సరోజ్ తెరకెక్కించిన సన్నివేశాల్ని మేము తొలగించామన్నది నిజం కాదని పేర్కొన్నారు. ప్రవీణ్రెడ్డి, హిమాన్షి ప్రధాన పాత్రల్లో నటించిన ‘సూర్యాస్తమయం’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రాంతికుమార్తోట, రఘు నిర్మించారు. బండి సరోజ్ దర్శకుడు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ ‘దర్శకుడు బండి సరోజ్ సినిమాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ను అడ్డుకుంటున్నాడు. స్నేహితుడి భవిష్యత్తు కోసం సినిమా చేస్తే మాపై అనవసరపు నిందలు వేస్తున్నాడు. తాను మాత్రమే బాగుండాలనే సరోజ్ ఆలోచన విధానం మంచిది కాదు’ అని తెలిపారు. స్నేహం గొప్పతనాన్ని చక్కగా చూపించిన చిత్రమిదని ప్రవీణ్రెడ్డి పేర్కొన్నారు.