నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ మూవీ సెప్టెంబర్ 10న విడుదల కావల్సి ఉండగా, పలు కారణాల వలన వాయిదా పడింది. చిత్రాన్ని సునీల్ నారంగ్- పుస్కూరి రామ్మోహనరావు సంయుక్తంగా నిర్మించారు. ఇన్నాళ్లు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న ఈ నిర్మాతలు ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.
డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన సునీల్ నారంగ్ కి నైజాం ఏరియాలో మంచి గ్రిప్ ఉంది. ఆయన చేతిలో థియేటర్స్ కూడా ఉండడంతో సినిమాల నిర్మాణంతో మరిన్ని లాభాలు రాబట్టాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా వారు ఆ మధ్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇక తాజాగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ని కలిసారు. ఏదో విషయంపై వీరు చర్చించినట్టు తెలుస్తుంది. చూస్తుంటే రానున్న రోజులలో వారు కమల్ హాసన్తో పాన్ ఇండియా సినిమా చేయనున్నట్టు అర్ధమవుతుంది. ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్.. విక్రమ్ అనే సినిమా చేస్తున్నారు. తదుపరి శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 పూర్తి చేయనున్నారు. ఆ మధ్యంలో వీరితో సినిమా చేసే అవకాశం ఉందని టాక్. నిజంగా కమల్తో, సునీల్ నారంగ్-పుస్కూరి రామ్మోహన్రావు సినిమా ఓకే అయితే వీరు మరో అడుగు ముందుకేసినట్టే అనుకోవాలి.