తెలుగు సినీ నిర్మాత ఆర్ఆర్ వెంకట్(57) సోమవారం ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయన ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిత్ర నిర్మాణంపై ఆసక్తితో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ అనే సంస్థను స్థాపించిన వెంకట్ పద్నాలుగు సినిమాల్ని నిర్మించారు. మహేష్బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి అగ్రకథానాయకులతో సినిమాల్ని తెరకెక్కించారు. సామాన్యుడు, ఆంధ్రావాలా, బిజినెస్మెన్, కిక్, పూలరంగడు, ప్రేమకావాలి, డాన్శీను, లవ్లీతో పాటు పలు చిత్రాలతో నిర్మాతగా పెద్ద విజయాల్ని అందుకున్నారు వెంకట్. ఆంగ్లంలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘డివోర్స్ ఇన్విటేషన్’ అనే సినిమాను నిర్మించారాయన. వెంకట్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన అంత్యక్రియలను మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు నిర్వహించారు.