కోజికొడ్, మార్చి 15: ప్రఖ్యాత కథాకళి కళాకారుడు గురు చెమన్చెరి కున్హిరామన్ నాయర్ సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 105 ఏండ్లు. కొయిలాండిలోని చెలియలో తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. నాయర్ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోదీ, కేరళ సీఎం పినరాయి విజయన్ తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.