కొవిడ్ బారిన పడి నిర్మాత సి.ఎన్.రావు(చిట్టి నాగేశ్వరరావు) కన్నుమూశారు. తెలుగులో మా సిరిమల్లె, అమ్మనాన్నలేకుంటే, బ్రహ్మానందం డ్రామా కంపెనీతో పాటు తమిళంలో ఊరగా వంటి చిత్రాలకు నిర్మాతగా, పంపిణీదారుడిగా సి.ఎన్.రావు వ్యవహరించారు. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శిగా, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడిగా సి.ఎన్.రావు పనిచేస్తున్నారు.