కరోనా వలన సినీ పరిశ్రమ ఎంత దారుణ పరిస్థితులని ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు థియేటర్లోతమ సినిమాలను విడుదల చేసే నిర్మాతలు ఇప్పుడు ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. కరోనా వలన థియేటర్స్కి వచ్చేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.ఈ క్రమంలోనే తమ సినిమాలను ఓటీటీ ప్లాట్ఫామ్లపై విడుదల చేయాలని నిర్ణయించుకుంటున్నారు.
ఓటీటీ సంస్థలు కూడా నిర్మాతలకు భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి. రీసెంట్గా యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్యాచోప్రాకు పలు ఓటీటీ ప్లాట్ ఫాంల నుంచి భారీ ఢీల్కు ఆఫర్లు వచ్చాయట. యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థలో ఆయన నిర్మించిన ‘బంటీ ఔర్ బబ్లీ 2’, ‘పృథ్విరాజ్’, ‘జయేశ్ భాయ్ జోర్దార్’ సినిమాలకు ఓటీటీ ఆఫర్ ఇచ్చారట. ఈ నాలుగు సినిమాలను అమెజాన్ ప్రైమ్ వీడియో 400 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి చోప్రాకు ఆఫర్ ఇచ్చింది.
అయితే చోప్రా ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. మహారాష్ట్రలో థియేటర్లు తెరుచుకున్న తర్వాతే ఈ నాలుగు చిత్రాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట ఆదిత్య చోప్రా. థియేటర్ల తెరుచుకున్న వెంటనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేస్తున్నట్లు సమాచారం.