బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో ట్రాన్స్జెండర్గా హౌజ్లో అడుగుపెట్టింది ప్రియాంక అలియాస్ సాయి తేజ. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ప్రియాంక సింగ్ మొదట్లోనే తాను ట్రాన్స్ జెండర్గా మారడానికి కారణాలను ఇంటి సభ్యులకు వివరించడమే కాకుండా ఆ విషయాన్ని తన తండ్రికి ఆ విషయాన్ని ఎలా చెప్పాలో అర్ధంకాక బాధపడిన సందర్భాలను కూడా తెలియజేసింది. అయితే ఎట్టకేలకు ప్రియాంక మనోభావాలను అర్ధం చేసుకున్న ఆయన తండ్రి ఆమెను స్వాగతించారు.
ప్రియాంక బర్త్ డే రోజు బిగ్ బాస్ ఓ వీడియో ప్లే చేయగా, అందులో ప్రియాంక తండ్రి మాట్లాడుతూ.. నాన్న సాయితేజ నువ్వు అమ్మాయైన, అబ్బాయైన నువ్వే మా సర్వం నానా అంటూ ఎమోషనల్గా ఆయన చెప్పిన మాటలు అటు ఇంటి సభ్యులనే కాకుండా ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. ఇక పింకీ కూడా తండ్రి మాటలను విని చాలా సంతోషించింది.
అయితే సాయి తేజ.. ప్రియాంకగా మారడం వెనుకు దైవ నిర్ణయం ఉందని చెప్పుకొచ్చింది ప్రియాంక . తాను ట్రాన్స్ జెండర్గా మారాలని అనుకున్నప్పుడు ఎవరి సలహా తీసుకోవాలో తెలియక.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సన్నిధికి వెళ్లి అక్కడ అమ్మవారి సన్నిధిలో రూపాయి కాయిన్ని నిలబెట్టి మనసులో కోరిక కోరుకుందట. సాధారణంగా అమ్మవారి గుడిలో పెట్టిన కాయిన్ పడిపోతే ఆ కోరిక నెరవేరదని.. ఒకవేళ కాయిన్ నిలబడే ఉంటే తప్పకుండా కోరిక నెరవేరుతుందని బలంగా నమ్ముతుంటారు భక్తులు.
ఈ క్రమంలో ప్రియాంక తన మనసులోని మాటని అమ్మవారికి చెప్పి రూపాయి కాయిన్ నిలబెట్టింది. ఆ రూపాయి కాయిన్ పడిపోకుండా నిలబడే ఉండటంతో అమ్మవారి అనుగ్రహం లభించింది అనుకుని వెంటనే ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకుని ట్రాన్స్ జెండర్గా మారానని చెప్పుకొచ్చింది ప్రియాంక. ఆపరేషన్ కోసం తాను ఎన్ని కష్టాలు కూడా పడిందో వివరించింది.