జమ్మికుంట : ఈటల రాజేందర్కు మంత్రి పదవి కట్టబెట్టి గౌరవిస్తే.. ఆయన సీఎం కుర్చీకే ఎసరు పెట్టాలని చూసిండని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ను విచ్ఛిన్నం చేయాలని కుట్ర చేశాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ పథకాలను ‘పరిగె’తో పోల్చి ప్రజలను అవమానించినట్టు చెప్పారు. సోమవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ మండల ముఖ్యకార్యకర్తల సమావేశంతోపాటు హుజూరాబాద్ పట్టణంలో 260మంది లబ్ధిదారులకు రూ.2.60 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసి, మాట్లాడారు. ఈటల టీఆర్ఎస్లో ఉన్నత పదవులన్నీ అనుభవించి, సీఎం సీటుకే ఎసరు పెట్టిన కుట్రదారుగా అభివర్ణించారు. సీఎం కేసీఆర్ ఒక వ్యక్తి కాదని, శక్తి అని పేర్కొన్నారు. తమ్ముడూ అని భుజం తట్టి ప్రోత్సహించిన కేసీఆర్కు, పార్టీకి ద్రోహం చేసేందుకు సిద్ధమయ్యాడని ఈటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని తెలిపారు. రాబోయే ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే పట్టం కట్టాలని కోరారు.
అన్నీ అనుభవించి.. ఇప్పుడు సుద్దులా?
ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన ఆనంతరం సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. సీఎం కేసీఆర్పై చేసిన ఈటల చేసిన ఆరోపణలకు
టీఆర్ఎస్ శ్రేణులు కౌంటర్ ఇచ్చాయి..
ఈటల మాట
టీఆర్ఎస్ తూటా