న్యూఢిల్లీ, మే 15: కార్ల తయారీలో రెండో అతిపెద్ద సంస్థ హ్యుందాయ్ కూడా వారంటీ, ఉచిత సేవల గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవతుండటంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో సర్వీసులు అందుకోలేని వారిని దృష్టిలో పెట్టుకొని సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ సేవలను వినియోగించుకోవాలని సంస్థ సూచించింది. మరోవైపు, అత్యవసర సేవలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.